telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇక రీమిక్స్ సాంగ్స్ కు దూరం… బాలూ గారు తిడుతున్నారు : తమన్

Thaman

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా ఎస్ఎస్ తమన్ కొనసాగుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ బిజీగా ఉన్నాడు. ఇటీవల తమన్ స్వరపరిచిన `అల వైకుంఠపురములో..` పాటలు సెన్సేషన్ అయ్యాయి. తాజాగా మీడియా ముందుకొచ్చిన తమన్ తను తీసుకున్న కొత్త నిర్ణయం గురించి ప్రకటించాడు. ఇప్పటికే పలు సినిమాల్లో పాత పాటలను రీమిక్స్ చేసిన తమన్.. ఇకపై అలాంటివి చేయనంటున్నాడు. `ఇకపై రీమిక్స్ సాంగ్స్ చేయాలనుకోవడం లేదు. ఆ పాటలు చేయడం చాలా టెన్షన్. ఒరిజినల్ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్, రచయిత, గాయకులు అందరూ ఈ రీమిక్స్ పాటలను తిట్టుకుంటారు. అంత టెన్షన్ అనవసరమని నాకనిపిస్తోంది. ఇలా రీమిక్స్ సాంగ్స్ చేసినప్పుడల్లా బాలూగారూ ఫోన్ చేసి తిడుతుంటారు. ఏదైనా పాట రీమిక్స్ చేస్తే.. `ఇవన్నీ నీకెందుకురా? అవసరమా?` అని తిడుతుంటారు. అందుకే ఇకపై రీమిక్స్ చేయను. ఆ విషయం డైరెక్టర్లకు ముందుగానే చెప్పేస్తున్నాన`ని తమన్ చెప్పాడు.

Related posts