హైద్రాబాద్ శివారు ప్రాంతంలోని మొయినాబాద్ మండలం హిమాయత్సాగర్లో ఇంటి యజమాని వేధింపులు తాళలేక ఓ మైనారిటీ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పై ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. రాజేంద్రనగర్లో బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళలకు, మైనార్టీలకు రక్షణ కల్పిస్తున్నామని అసెంబ్లీలో డబ్బాలు కొట్టుకోవడం కాదు, మంత్రులు బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలనిఅన్నారు. మైనారిటీ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
హిమాయత్నగర్కు చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడు మైనార్టీ కుటుంబానికి చెందిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశారని ఆరోపించారు. సంఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా బాధితులకు న్యాయం జరగలేదన్నారు. నాలుగేళ్లుగా వెట్టిచాకిరీ చేయించుకొని అఘాయిత్యం చేశాడని ఆరోపించారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి ఉరి శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వామన్రావుపై ఓ మహిళ ఆరోపణలు