telugu navyamedia
క్రీడలు వార్తలు

పంత్ భారత జట్టుకే కెప్టెన్ అవచ్చు : అజహరుద్దీన్‌

ఐపీఎల్ 2021‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. దాంతో ఈ ఏడాది ఐపీఎల్ లో ఆ జట్టును టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ నడిపించనున్నాడు. అయితే ఢిల్లీ కెప్టెన్‌గా పంత్‌ పేరును ప్రకటించడంపై పలువురు మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని పై టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ ఓ ట్వీట్‌ చేస్తూ.. రిషబ్ పంత్‌ టీమిండియా కెప్టెనైనా ఆశ్చర్యపోను అని పేర్కొన్నాడు. ‘రిషబ్ పంత్‌ కొన్ని నెలలుగా అన్ని ఫార్మాట్లలోనూ అతడేంటో నిరూపించుకుంటున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలలో అద్భుతంగా రాణించాడు. సమీప భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్‌ రేసులో సెలక్టర్ల దృష్టిలో అందరికన్నా ముందున్నా నేను ఆశ్చర్చపోను. అతడి దూకుడైన ఆటతీరు భవిష్యత్‌లో భారత్‌ను మంచి స్థితిలో నిలుపుతుంది’ అని అన్నారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా చెన్నై సూపర్​కింగ్స్​తో తలపడనుంది.

Related posts