telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశం మొత్తం … ఎన్నార్సీ అమలు… : రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh inaugurates NIA office

భారతదేశం మొత్తం ఎన్నార్సీని అమలు పరుస్తామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. దేశంలో ఎవరు అక్రమ వలసదారులో తెలుసుకోవాల్సిన హక్కు ప్రతీ పౌరుడికీ ఉందని, కొందరు దీన్ని విమర్శిస్తున్నారని, మతంతో ముడిపెడుతున్నారని మండిపడ్డారు. జార్ఖండ్ లోని బోకారో లో ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.

మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. కొందరు ఈ హామీపై తమను ఎగతాళి చేశారని, కానీ ఇప్పుడు తమను ఎవరూ ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు. జార్ఖండ్‌లో బంపర్ మెజారిటీతో తిరిగి విజయం సాధిస్తామని రాజ్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు.

Related posts