భారతదేశం మొత్తం ఎన్నార్సీని అమలు పరుస్తామని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. దేశంలో ఎవరు అక్రమ వలసదారులో తెలుసుకోవాల్సిన హక్కు ప్రతీ పౌరుడికీ ఉందని, కొందరు దీన్ని విమర్శిస్తున్నారని, మతంతో ముడిపెడుతున్నారని మండిపడ్డారు. జార్ఖండ్ లోని బోకారో లో ఓ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు.
మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. కొందరు ఈ హామీపై తమను ఎగతాళి చేశారని, కానీ ఇప్పుడు తమను ఎవరూ ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు. జార్ఖండ్లో బంపర్ మెజారిటీతో తిరిగి విజయం సాధిస్తామని రాజ్నాథ్ ధీమా వ్యక్తం చేశారు.
భర్త గురించి శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు