పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర సరిహద్దు జిల్లా దక్షిణ దినాజ్పూర్లోని బునియద్పూర్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి, రెండో విడత ఎన్నికల్లో ఓటర్ల సరళి చూశాక స్పీడ్ బ్రేకర్ దీదీకి కంటిమీద కునుకు కరువైందని వ్యాఖ్యానించారు.
మొదట్లో రాష్ట్రాభివృద్ధిపై చూపే శ్రద్ధ, నిరాడంబరత, కష్టించేతత్వం చూసి మమతా బెనర్జీ ఆదర్శ మహిళని అనుకున్నా. కానీ, ఆ తర్వాత ఆమె వ్యవహార శైలి చూసి నాకున్న భ్రమలు తొలగిపోయాయన్నారు. ఆమె అసలు నైజం తెలిసింది. ఆమె ఎలాంటిదో ఇప్పుడు పిల్లలకు సైతం తెలిసిపోయిందన్నారు. బంగ్లాదేశ్ నటుడు ఫిర్దౌస్ టీఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై స్పందిస్తూ ఎన్నికల్లో ప్రచారం కోసం పొరుగు దేశస్తులను వాడుకోవడం సిగ్గుచేటన్నారు. మైనారిటీలను మచ్చిక చేసుకునేందుకే టీఎంసీ ఇలా చేస్తోందిని విమర్శించారు.
బీసీలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపించారు: యనమల