telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మొన్నటి వరకు మోదీతో..ఇప్పుడు రాహుల్ జపం

tdp leader rajendraprasad fire on ycp

టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తెలంగాణ సీఎం కేసీఆర్‌, వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొన్నటి వరకు మోదీతో మంతనాలు జరిపి.. ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసి కేసీఆర్‌, జగన్ రాహుల్ జపం చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ, జగన్, కేసీఆర్‌ కుట్రలను చంద్రబాబు ఒంటి చేత్తో తిప్పికొట్టారని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వీవీ ప్యాట్‌లు లెక్కిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? అని ప్రశ్నించారు. పోలింగ్ నాటి నుంచి నేటి వరకు జగన్ ప్రజల్లోకి రావడం మానేశారని విమర్శలు గుప్పించారు.
లోటస్‌పాండ్ ఏసీ గదుల్లో కూర్చున్న జగన్ ఏపీని మరచిపోయారన్నారు. ఎలాగూ వైసీపీ ఓడిపోతుందని జగన్‌కు అర్ధమైందని జోస్యం చెప్పారు. విజయసాయిరెడ్డి విషపుసాయిరెడ్డిగా మారి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts