telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో నేడు, రేపు వ్యాక్సిన్ బంద్

Corona Virus Vaccine

దేశంలో నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే నేటి నుంచి టీకా ప్రక్రియ మొదలవుతోంది. అర్హులందరికీ వ్యాక్సిన్‌ అనే కేంద్రం నిర్ణయానికి ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. మార్చి 1 నుంచి 18 నుంచి 44 ఏండ్లవారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా, వ్యాక్సిన్ల కొరత కారణంగా టీకా కార్యక్రమమే నిలిచిపోతున్నది. కేంద్రం నుంచి సరిపడా డోసులు రాష్ట్రానికి రాకపోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ సంచాలకుడు జీ శ్రీనివాస్‌ శుక్రవారం ప్రకటించారు. ఇప్పటికే వ్యాక్సిన్లు అందకపోవటం వల్ల తొలి డోసు తీసుకున్న అనేక మంది రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. కొవాగ్జిన్‌ తొలి డోసు పూర్తిగా కరువైపోగా, కోవిషీల్డ్‌ మొదటి డోసు తీసుకొని సెకండ్‌ డోసు కోసం ఎదురు చూస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది.

 

Related posts