అసెంబ్లీలో ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలకు ఈ బడ్జెట్ నిదర్శనమని అన్నారు. ఈ బడ్జెట్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోందనిఆయన విమర్శించారు. రుణమాఫీపై బడ్జెట్ లో స్పష్టత లేదని, కేసీఆర్ కు సీఎంగా కొనసాగే హక్కు లేదని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్ లో ప్రస్తావించలేదని విమర్శించారు.
ఆరోగ్యశ్రీ అమలు చేస్తూనే కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ నిధులను తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా తెచ్చుకునే అవకాశంఉన్నప్పటికీ కేసీఆర్ ఆ పని చేయలేదని మండిపడ్డారు. “కాళేశ్వరం” ను జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటిస్తే తన కమీషన్ల లెక్కలు ఎక్కడ బయటకు వస్తాయో అని కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించారు. ఆర్థికంగా మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 24 వేల లోటు బడ్జెట్ రాష్ట్రంగా తయారు చేశారని దుయ్యబట్టారు.