ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను ఈడీ టార్గెట్ చేసింది. గత కొన్ని రోజుల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు జరుపుతున్నాయి. ఇసుక మైనింగ్ కేసులకు సంబంధించి సీబీఐ ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. నేరుగా అఖిలేష్ పేరు ప్రస్తావించకున్నా… ఆయన మైనింగ్ శాఖ మంత్రి ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ పేర్కొంది.
ఇంతలో గోమతి రివర్ ఫ్రంట్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇవాళ సోదాలు నిర్వహిస్తోంది. యూపీతో పాటు ఢిల్లీలో ఏకకాలంలో పది చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు సోదాలు పూర్తిఅయ్యాక అధికారులు వెల్లడించనున్నారు.