telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేంద్రం ఎన్నిసార్లు చెప్పినా జగన్ వినిపించుకోవడం లేదు: కేంద్ర మంత్రి ఆర్కే సింగ్

r k singh minister

విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో టీడీపీ హయాంలో భారీ అవినీతి చోటు చేసుకుందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ స్పందించారు. విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగినట్టు ఎక్కడా ఆధారాలు లేవని తెలిపారు. సరైన ఆధారాలు లేకుండానే పీపీఏలను రద్దు చేయాలని కోరుతున్నారని చెప్పారు.

పవర్ ప్రాజెక్టులపై కేంద్రం ఎన్నిసార్లు చెప్పినా జగన్ వినిపించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. పవర్ ప్రాజెక్టులపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారనిమంత్రి విమర్శించారు. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దేశ వ్యాప్తంగా పెట్టుబడులపై ప్రభావం చూపుతోందని అన్నారు. త్వరలోనే పీపీఏల వివాదం సద్దుమణుగుతుందనే నమ్మకం ఉందని చెప్పారు.

Related posts