telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చెన్నై అపోలో నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జ్…

roja ycp mla

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ ఫైర్ బ్రాండ్ రోజా చెన్నైలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెండు మేజర్ శస్త్ర చికిత్సల కోసం హాస్పిటల్ లో జాయిన్ అయిన ఆమె పది రోజుల పాటు హాస్పిటల్ లోనే గడపాల్సి వచ్చింది. ఇక విడుదలైన అనంతరం ఆమె మాట్లాడుతూ తాను ఆసుపత్రిలో ఉన్నా ఇంట్లో ఉన్నా తన ఆలోచన అంతా వైసీపీ గెలుపు మీదనే ఉంటుందని పేర్కొన్నారు. నిజానికి గత ఏడాది రోజాకు సర్జరీ చేయాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో సర్జరీలను వాయిదా వేశారు. ఇటీవల సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లగా… వెంటనే సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. అయితే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పూర్తయ్యేంతవరకూ రోజా సర్జరీని వాయిదా వేయాలని కోరినప్పటికీ… అది మంచి నిర్ణయం కాదని వైద్యులు వారించినట్లు సెల్వమణి తెలిపారు. దీంతో ఇక ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ఆమె భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షు మాలిక, కుమారుడు కృష్ణ కౌశిక్, కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని వారి స్వగృహానికి తీసుకెళ్లారు. ఆరోగ్యం పూర్తిగా కుదుట పడే వరకు ఆమె చెన్నైలోనే విశ్రాంతి తీసుకుంటారని ఆర్కే సెల్వమణి తెలిపారు.

Related posts