telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తిరుమల వెంకన్న సన్నిధిలో ఎమ్మెల్యే రోజా..

ఇటు రాజ‌కీయాల్లో, అటు సినీ రంగంలో త‌నదైన వ్య‌క్తిత్వంలో దూసుకుపోతున్న‌ సినీనటి, వైఎస్ ఆర్ సీపీ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా పుట్టిన రోజు నేడు..

తన పుట్టిన రోజు పుర‌స్క‌రించుకుని తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.  ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. టిటిడి అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం తీర్ధ ప్రసాదాలు అందచేశారు అర్చకులు.

అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు..  ఈ రోజు నా పుట్టిన రోజు..నా ఇష్ట దైవ మైన వెంక‌టేశ్వ‌ర స్వామి ఆశీస్సులు తీసుకోవ‌డానికి కొండ‌కి వ‌చ్చాను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అలాగే మేము మా క‌టుంబ‌స‌భ్య‌లు బాగుండాల‌ని ఆభగవంతుణ్ణి ప్రార్ధించినట్లు తెలిపారు.

 

Related posts