సిద్దిపేట జిల్లా దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉన్న ఆయన, ఇప్పటివరకూ నాలుగుసార్లు దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో విషాదఛాయలు అలముకున్నాయి.
రామలింగారెడ్డి 25 సంవత్సరాలు జర్నలిస్ట్ గా పనిచేశారు. ఆయన స్వస్థలం చిట్టాపూర్ గ్రామం ఆయనకు భార్య సుజాత, కుమారుడు సతీశ్ రెడ్డి, కుమార్తె ఉదయశ్రీ ఉన్నారు. 2004లో తొలిసారిగా దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, 2008 ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆపై 2009లో ఓటమి పాలైనా, 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆయన కొంతకాలం నక్సలైట్ ఉద్యమంలోనూ పనిచేశారు. సోలిపేట మృతిపై టీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
వైసీపీ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ చెప్పిన చోట జగన్ సంతకం: చంద్రబాబు