telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

పోలవరం ప్రాజెక్ట్‌ని రూ.60 వేల కోట్లకు: షర్మిల

ys sharmila press meet
రూ. 15 వేల కోట్లు ఖర్చు అయ్యే పోలవరం ప్రాజెక్ట్‌ని రూ.60 వేల కోట్లకు పెంచారని టీపీపీ ప్రభుత్వాన్ని  వైఎస్  షర్మిల విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆమె పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో రోడ్ షోలో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదని  స్పష్టం చేశారు. 
అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేకపోయారని విమర్శించారు. మంత్రి లోకేష్‌కు వర్థంతి, జయంతికి తేడా తెలియని పప్పు అని షర్మిల విమర్శించారు. చంద్రబాబుది పూటకో వేషం వేస్తూ, రోజుకో మాట మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ క్రూరుడు, రాక్షసుడని, అలాంటి దుర్మార్గుడికి చంద్రబాబు మళ్లీ టికెట్‌ ఇచ్చారని ఆమె ఆరోపించారు. టీడీపీ నేత చింతమనేని అక్రమాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని  షర్మిల ఆరోపించారు.

Related posts