భారత్ లో కొన్ని రోజులుగా పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూపోతున్నాయి చమురు సంస్థలు.. ఇవాళ అదనంగా మరో 27 పైసల భారం మోపాయి ఆయిల్ కంపెనీలు.. దీంతో పెట్రో ధరలు దేశంలో సరికొత్త రికార్డులు నెలకొల్పాయి.. తాజా వడ్డింపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.86.30కు చేరుకోగా.. డీజిల్ ధర రూ.76.48కు పెరిగింది.. ఇక, దేశంలోనే అత్యధికంగా జైపూర్లో పెట్రోల్ ధర రూ. 93.60గా పలికింది. డీజిల్ రూ.85.67కి చేరాయి. ఇక ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే.. కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ.87.69, లీటర్ డీజిల్ రూ.80..08గా ఉండగా.. ముంబైలో పెట్రోల్ రూ.92.86, డీజిల్ రూ.83.30కి చేరింది. ఇక, చెన్నైలో పెట్రోల్ రూ.88.82కి, డీజిల్ రూ.81.71కి పెరిగింది. బెంగళూరులో పెట్రోల్ రూ.88.95గా, డీజిల్ రూ.80.84గా అమ్ముడుపోతోంది. వివిధ స్థానిక పన్నులు మరియు వ్యాట్ విధించినందున ఆటో ఇంధనాల ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా భిన్నంగా ఉంటాయి. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర గత 20 రోజులలో స్థిరంగా ఉన్నప్పటికీ, దేశీయ చమురు సంస్థలు మాత్రం వడ్డింపు ఆపడంలేదు.. ప్రస్తుతం క్రూడాయిల్ ధర బ్యారెల్ 55 నుంచి 56 డాలర్ల మధ్య కొనసాగుతోంది. చూడాలి మరి ఎలా ఎన్ని ఈరోజులు అనేది.
previous post