telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అచ్చెన్నాయుడికి టీడీపీపై కోపం.. అందుకే పార్టిని మూసేయాల‌నే ఆలోచ‌న‌..

అచ్చెన్నాయుడికి టీడీపీపై కోపం ఉందని, అందుకే మాట్లాడితే పార్టిని మూసేయాలనే ఆలోచలనలో అచ్చెన్నాయుడు ఉన్నట్లు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ టీడీపీకి అదే గతిపడుతుంది. 

శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల రోజా మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌తిపక్షాలపై మండిపడ్డారు. పార్టీకి కస్టపడి పనిచేసిన వారంతా ప్రజా ప్రతినిధులు అయ్యారని.., గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తుంటే హారతి పట్టి స్వాగతం పలుకుతున్నారని రోజా అన్నారు.

రాష్ట్ర ప్రజలకు మంచి జరిగితే చంద్రబాబు, లోకేష్ లు ఏడుస్తున్నారన్న రోజా.. పదవ తరగతి ఉత్తీర్ణత పై టిడిపి దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.పిల్లలతో రాజకీయం చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని.., ఫెయిల్ అయిన విద్యార్థులతో మీటింగ్ పెట్టారని విమర్శించారు.

మహనాడులో తోడగోట్టి రమ్మని పిలిచిన టీడీపీ నాయకులు, లోకేష్ జూమ్ మీటింగ్‌కి కొడాలి నాని, వంశీ వస్తే ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు.

వైసీపీ గెలిస్తే పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పారన్నారు. టీడీపీకి దమ్ము దైర్యం ఉంటె టీడీపీ మేనిఫెస్టో., వైసీపీ మేనిఫెస్టో పోల్చి చూడాలని రోజా సవాల్ చేశారు.

పవన్ కల్యాణ్ జనసేన పెట్టింది జనం కోసమా.. చంద్రబాబు కోసమా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు కష్టం వస్తే పవన్‌ వెంటనే ప్రెస్‌మీటో.. యాత్రో చేస్తారని మంత్రి రోజా అన్నారు. అయితే ఇప్పుడు పవన్‌ బస్సు యాత్ర ఎందుకు చేస్తూన్నాడో ఆయనకైనా తెలుసా అని మంత్రి రోజా అన్నారు.

అలాగే కొన్ని చానెల్స్ తనపై అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాతో మహా ద్వారం ద్వారా గన్ మెన్ వెళ్లారని. తాను… తన సిబ్బంది ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా ఎప్పుడు నడుచుకోలేదంటూ తెలిపారు.

 

Related posts