ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు(73) కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి గుండెపోటుతో తుదిశ్వాసవిడిచారు. గతంలో సీఎంల అవినీతిపై కోర్టులో ఆయన పోరాడడంతో ముగ్గురు ముఖ్యమంత్రులు పదవి కోల్పోవాల్సి వచ్చింది. హైదరాబాద్ నగర పాలక సంస్థకు 15 ఏళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించేలా ఆయన కోర్టులో పోరాడి విజయం సాధించారు.
మాజీ సీఎం ఎన్టీఆర్ కి అల్లుడు కావడం వల్లనే అప్పట్లో చంద్రబాబుకు కర్షక పరిషత్ చైర్మన్ పదవిని ఇచ్చారన్న అంశంపై రామచంద్రరావు రెండు సార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తిరుమల తిరుపతి దేవస్థాన నిధులు రూ.25 వేల కోట్లు ధార్మికేతర కార్యక్రమాలకు మళ్లకుండా ఆయన రక్షించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు తెలంగాణకు ఎలక్ట్రిక్ పవర్, నీళ్లు అంశాలపై ఆయన సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.