telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘ఇంగ్లీషు’రాక 3 నెలలు ఇబ్బందిపడ్డాను: పుష్పశ్రీవాణి

pushpa sreevani

సీఎం జగన్ తీసుకున్న నిర్ణయమే ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన అని ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. అసెంబ్లీలో ఈరోజు ఆమె మాట్లాడుతూ ‘ఇంగ్లీషు’ రాక ఎంత ఇబ్బండిపడాల్సి వచ్చిందో గుర్తుచేసుకున్నారు. తాను టెస్త్ క్లాస్ వరకు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ లో చదివానని తెలిపారు.

ఏలూరులోని సెయింట్ థెరిస్సాలో చేరినప్పుడు తనకు ‘ఇంగ్లీషు’ రాకపోవడంతో మూడు నెలల పాటు ఇబ్బంది పడ్డాడని తెలిపారు. దీంతో, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతానన్న భయమేసి, ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చేశానని, జంగారెడ్డి గూడెంలో మరో కాలేజీలో తెలుగు మీడియంలో చేరిన విషయాన్ని ఆమె జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఇంటర్మీడియట్ పాసైన తర్వాత డిగ్రీలో ఇంగ్లీషు మీడియం తీసుకుని పాసయ్యానని అన్నారు.

ఇప్పుడు ఇంగ్లీషు భాష తనకు అర్థమవుతుంది తప్ప మాట్లాడటం రాదని పుష్పశ్రీ వాణి చెప్పారు. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గా గిరిజన విద్యార్థులు నిర్వహించిన ఓ సైన్స్ ఫేర్ కార్యక్రమానికి ఇటీవల వెళ్లానని, ఆయా ప్రయోగాల గురించి విద్యార్థులు ‘ఇంగ్లీషు’లో వివరించి చెబుతుంటే తనకు అర్థమవుతోంది గానీ, తిరిగి అదే భాషలో వారికి సమాధానం చెప్పలేకపోవడంతో తాను చాలా బాధపడ్డానని అన్నారు. ఈ విషయం చెప్పడానికి తానేమీ సిగ్గుపడటం లేదన్నారు.

Related posts