telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

హైదారాబాద్ మహిళ హత్యాచారా కేసులో వెలుగులోకి కీలక అంశాలు…

హైదారాబాద్ రామచంద్రపురం మహిళ పై అత్యాచారం,  హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళను  కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు  పాల్పడి హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. మహిళను మాయమాటలతో నమ్మించి గ్యాంగ్ రేప్ కు  పాల్పడ్డ ముగ్గురు యువకులు, గ్యాంగ్ రేప్ తర్వాత మహిళ ని చంపేసినట్టు తేల్చారు. ఈ విషయం మీద మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ మహిళ రేప్ అండ్ మర్డర్ లో ముగ్గురు అరెస్ట్ చేసామని అన్నారు. ప్రేమలతను నమ్మించి మధు నాయక్ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆయన అన్నారు. మధు నాయక్ పిలవడంతో ప్రేమలత వెళ్లినట్టు ఆయన పేర్కన్నారు.  ముందుగా వేసిన ప్లాన్ ప్రకారం మధుతో నందు యాదవ్, కుటుంబ రెడ్డిలు కూడా అత్యాచారం చేశారని, ప్రేమ లతని చందానగర్ లో కారులో ఎక్కించుకుని కొల్లూరు కు తీసుకెళ్లారని, అక్కడ ముగ్గురూ కలిసి మహిళపై అత్యాచారం చేశారని అయన అన్నారు. అత్యచార సమయంలో ఆమె తలకు బలమైమ గాయమైందని అందుకే ఆమె చనిపోయిందని డీసీపీ పేర్కొన్నారు. మిస్సింగ్ కేసు నమోదుతో కేసు దర్యాప్తు చేశామన్న ఆయన ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని అన్నారు. మధు నాయక్ కు మహిళకు పరిచయం ఉండడం వలెనే ఇలా జరిగిందని ఆయన అన్నారు. నమ్మి తెల్సిన వ్యక్తి కావడంతో మహిళ వెళ్లిందని కానీ వాళ్ళు నమ్మించి అత్యాచారం చేశారని తెలిపారు. 

Related posts