రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ రాధా ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మోతి నగర్ లో మొక్కలు నాటిన బుల్లితెర నటి ప్రియాంక (బంగారు కోడలు సీరియల్). ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ ఆక్సిజన్ అనేది మన మానవ మనుగడకు ఎంతో ముఖ్యమని అలాంటి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను పెంచే బాధ్యత మనందరిపై ఉందని భారతదేశం గ్రీన్ గా మారాలని హరిత తెలంగాణ కావాలనే ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అద్భుతంగా ముందుకు పోతుందని. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తన సహచర నటులు అనిక; అనుశ్రీ; సంయుక్త లను గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.
previous post
మనీష్ ను పక్కన పెట్టడం పై వార్నర్ సంచలన వ్యాఖ్యలు…