నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉదయం 11గంటలకు, హన్మకొండలో మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే సభల్లో షా ప్రసంగిస్తారు.
నిన్న రాజ్ నాధ్ సింగ్ కూడా తెలంగాణాలో ప్రచారం చేశారు. ఈ సభకు జనం పలచగా హాజరయ్యారు, దీనితో రాజ్ నాధ్ నిరుత్సహపడినట్టు తెలుస్తుంది. మరి నేడు అమిత్ షా పరిస్థితి ఏమిటో చూడాల్సి ఉంది. ప్రచారాలకు ప్రజలు తరలించడంతో బీజేపీ ప్రచార సభలకు జనం పలచబడిపోతున్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు.