telugu navyamedia
తెలంగాణ వార్తలు

రాష్ట్రపతి ఎన్నికైన ద్రౌపది ముర్ము : దేశంలో కొత్త ఉత్సాహం వచ్చింది..

ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, స్వచ్ఛందంగా ప్రజలే సంబరాలు జరుపుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 

ద్రౌపది ముర్ము నివాసానికి కుటుంబ సమేతంగా వచ్చి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కిషన్ రెడ్డి ద్రౌపది ముర్ము ప్రచార కార్యక్రమంలో సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సంద‌ర్భంగా కిష‌న్‌రెడ్డి మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్‌ లో వందశాతం ముర్ముకు ఓట్లెయ్యటం అభినందనీయమన్నారు. రాజకీయాలకు అతీతంగా ద్రౌపది ముర్ముకు ఓట్లేసి గెలిపించారన్నారు.

ఇవాళ రాత్రి రామ్ నాథ్ కోవింద్ కు వీడ్కోలు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  విందు ఇస్తున్నారు రేపు రాష్ట్రపతి కొవింద్ కేంద్ర మంత్రులకు, ఎంపీలకు, ప్రముఖులకు రాష్ట్రపతి భవన్‌లో విందు ఇస్తారని కిషన్ రెడ్డి తెలిపారు.

 రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వీడ్కోలు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ విందును ఇస్తున్నారు. ఈ విందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మొగులయ్య, రామచందర్ రావులను కూడా ఆహ్వానించినట్టుగా కిష‌న్‌రెడ్డి మీడియాకు చెప్పారు

మరో వైపు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రేపు విందు ఇవ్వనున్నారు.ప్రధానిమోడీ సహా కేంద్ర మంత్రులతో పాటు పలువురికి కోవింద్ విందు ఇవ్వనున్నారు.

ఇవాళ ఉదయం తిరుప‌తి నుండి వచ్చిన అర్చకులు ద్రౌపది ముర్మును ఆశీర్వదించారు. తిరుపతి వెంకటేశ్వరస్వామికి చెందిన ప్రసాదాన్ని అందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ద్రౌపది ముర్మును అభినందించేందుకు పలువురు ఆమె ఇంటికి క్యూ కట్టారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముర్ము నివాసానికి వచ్చి అభినందనలు తెలిపారు.ఈ నెల 25వ తేదీన ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు.

Related posts