telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

అమిత్‌ షా గో బ్యాక్‌ అంటూ టీడీపీ నిరసన

TDP Candidate withdraw Badwel
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా రాజమండ్రిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటనకు వ్యతిరేకంగా గురువారం టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. అమిత్‌ షా గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.  బీజేపీతో కలిసి ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చిన టీడీపీ పై ఓ వైపు  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
స్థానిక క్వారీ సెంటర్‌ వద్ద అమిత్‌ షా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు అక్కడ అమిత్‌ షా గో బ్యాక్‌ అంటూ ప్లే కార్డులు ప్రదర్శిస్తు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు టీడీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్న ఏపీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు దుర్గాయాదవ్‌ సహా కార్యకర్తలను అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్న అమిత్‌ షా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై లబ్ధిదారులతో చర్చించనున్నట్టు ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు.

Related posts