telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వాళ్లకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌‌: లోకేష్‌

Minister Lokesh comments YS Jagan

మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ బ్రాండింగ్‌ తీసుకొస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. శనివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ చేనేత కార్మికులకు చేయుతనందిస్తానని హామీ ఇచ్చారు. రూ. 250 కోట్లతో చేనేత మార్కెటింగ్‌ నిధి ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

అలాగే చేనేత కుటుంబాలకు హెల్త్‌ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామన్నారు. దీనితో పాటు చేనేత కార్మికులకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పారు. మంగళగిరలో అంతర్జాతీయ టెక్స్‌టైల్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులకు రూ. 2 లక్షల చొప్పున రుణాలు అందజేస్తామని లోకేశ్ పేర్కొన్నారు.

Related posts