telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో విష జ్వరాలు.. ప్రభుత్వం మొద్దునిద్ర: రేవంత్ ఫైర్

Revanth-Reddy mp

తెలంగాణ ప్రభుత్వం పై కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో మండిపడ్డారు. రాష్ట్రంలో చాలాచోట్ల ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతున్నారు. మే నెల నుంచి ఇప్పటివరకూ తెలంగాణలో 43 లక్షలకు పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో పలు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు కూడా నిలిచిపోయాయి. ఈ వ్యవహారంపై రేవంత్ తీవ్రంగా స్పందించారు.

దున్నపోతుపై వాన పడితే అది కనీసం తోక అయినా ఆడిస్తుందని ఆయన తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రమంతా జ్వరాలతో అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన రేవంత్ రెడ్డి.. జ్వరాల పై ఓ దిన పత్రికలో ప్రచురితమైన కథనాన్ని తన ట్వీట్ కు జతచేశారు.

Related posts