telugu navyamedia
తెలంగాణ వార్తలు

కుల, మత పిచ్చోళ్లు మనకు వద్దు..చావడానికి సిద్ధంగా ఉన్న పార్టీ వారిది

*కొల్హాపూర్ బ‌హిరంగ‌స‌భ‌లో కాంగ్రెస్‌, బీజేపీ పై కేటీఆర్ సంచ‌ల‌న‌ కామెంట్స్ ..
*కేంద్రం అనాలోచిత నిర్ణ‌యాలు తీసుకుంటోంది..
*నల్లధనం తెస్తానన్న మోదీ.. తెల్లముఖం వేశారు..
*బీజేపీ నేత‌లు దేశాన్నిరావ‌ణ‌కాష్టంలా మార్చింది..

*కాంగ్రెస్‌కు కాలం చెల్లింది..

బీజేపీ, కాంగ్రెస్‌లపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . శనివారం మహబూబ్‌నగర్‌లోని కొల్హాపూర్‌లో బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ..కుల, మత పిచ్చోళ్లు మనకు వద్దని.. అభివృద్ధి చేసేవారే కావాలని  కేటీఆర్ అన్నారు. ప్రజలందరికీ అండగా ఉండే ప్రభుత్వమే మనందరికీ కావాలని తెలిపారు.

కాంగ్రెస్ కాలం చెల్లిన మందు లాంటిదని.. వారికి చరిత్ర తప్ప భవిష్యత్తు లేదని విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్​కు డిపాజిట్‌లు గల్లంతు అవుతుందన్నారు. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్‌ చావడానికి సిద్ధంగా ఉన్న పార్టీ అని.. అది తెలంగాణను ఉద్ధరిస్తదంటే ఎట్లా నమ్మాలని ఎద్దేవా చేశారు.

ఒక్క ఛాన్స్ అని రాహుల్ గాంధీ అడుగుతున్నారని.. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌కు 50 ఏళ్లు అధికారం ఇచ్చారని.. అన్నేళ్లు ఏమీ చేయలేని వాళ్లు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు . రాహుల్ గాంధీని గంటల తరబడి ఈడీ ఆఫీస్‌లో కూర్చోబెట్టినా అడిగేవాడు లేడని అన్నారు

కేంద్రం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోంది .బీజేపీకి మత పిచ్చి తప్ప మరోటి లేదని మండిపడ్డారు. దేశాన్ని రావణకాష్టంగా మార్చిందని విమర్శించారు.

మోదీ అధికారంలోకి రాక ముందు సిలిండర్ రూ. 400 ఉండేదని.. ఇప్పుడు సిలిండర్ ధర రూ. 1,050 అయిందని.. మ‌రి ఎవ‌డు అసమర్ధుడు ,ఎవ‌డు ద‌ద్ద‌మ్మ ,ఎవ‌డది చేత‌కాని త‌నం ఆలోచించుకోవాల‌ని కేటీఆర్ మోదీ ని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు.

తంబాకు తినడం తప్ప బండి సంజయ్‌కు ఏమి తెలియదని విమర్శించారు.నల్లధనం తెస్తానన్న ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు తెల్లముఖం వేశారు.

బీజేపీ ప్రభుత్వం విషం చిమ్మడం, విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప చేసిందేం లేదు. తెల్లారి లేస్తే ఒక మతాన్ని కించపరిచేలా చేయడం. ప్రధాని మోదీ ఇస్తానన్న పంద్రా లాఖ్ ఎక్కడ? కేంద్రంలో ఉన్నది అసమర్థ ప్రభుత్వం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Related posts