ఏపీలో గుడివాడ క్యాసినో రగడ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ మంత్రి కొడాలి నాని వర్సెస్ టీడీపీ నేత మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ కేసినోపై గవర్నర్కు ఫిర్యాదు చేసింది.
తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుడివాడలో మూడు రోజులు క్యాసినో జరిగితే, 362 రోజులు టీడీపీ చీర్ బాయ్స్ ప్రచారం చేస్తున్నారు. గుడివాడలో క్యాసినో నిర్వహించామని టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి అల్లరి చేశారు.
మూడు రోజులు గుడివాడలో నిర్వహించిన క్యాసినోకు ఐదు వందల కోట్లు వస్తే, 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు నాని ప్రశ్నించారు. గుడివాడలో క్యాసినో నిర్వహించామని టీడీపీ చీర్ బాయ్స్ అల్లరి అల్లరి చేశారు. గుడివాడలో నన్ను ఒడించలేకే లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలు అమాయకులు కాదు, వారికి అన్ని విషయాలు తెలుసు అని అన్నారు. స్థానిక టీడీపీ నేతలు కూడా పట్టించుకోని విషయాన్ని, టీడీపీ చీర్ బాయ్స్ పోలీసులకు ఫిర్యాదులు చెయ్యడం అవివేకం.
గుడివాడలో క్యాసినో వ్యవహారంపై త్వరలో అమెరికా అధ్యక్షుడు బైడెన్కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారేమో?. టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇచ్చాను వారికి చేతనైంది చేసుకోవాలి’ అని మంత్రి కొడాలి నాని అన్నారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలి: పత్తిపాటి పుల్లారావు డిమాండ్