telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఐపీసీ కాదు వైసీపీ కోడ్ అమలు చేస్తున్నారా?: దేవినేని ఉమ

devineni on power supply

వైసీపీ సర్కార్ పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వ్యవస్థపై హైకోర్టు సీరియస్ అయ్యిందంటూ మీడియాలో వచ్చిన కథనాలను పోస్ట్ చేస్తూ జగన్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.

ఏపీలో పోలీసు వ్యవస్థ గాడితప్పుతోందని కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని ఆ కథనాల్లో పేర్కొన్నారు.అమలాపురం మండలంలోని ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం కావడంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు కావడంతో ఈ విషయంలో పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టిందని కథనాల్లో ప్రచురించారు. గతంలోనూ మూడు కేసుల్లో జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని అందులో పేర్కొన్నారు.

ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు పలు ఛానెళ్లలో పేర్కొన్నారు. వీటిని దేవినేని ఉమ ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులనేవి ఉన్నాయా? మెజిస్ట్రేట్ విచారణ జరిగిన మూడు సార్లు పోలీసులదే తప్పని తేలింది. రాష్ట్రంలో ఐపీసీ కాదు వైసీపీ కోడ్ అమలు చేస్తున్నారా? జగన్ గారు అని దేవినేని ప్రశ్నించారు.

Related posts