టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈనాడు, చంద్రజ్యోతిలతో జీఎన్ రావు కమిటీని వక్రీకరించే రాతలు రాయించారని విమర్శించారు. ముంబై, చెన్నైలకు కూడా తుపాను తాకిడి ఉందని… విశాఖకు కూడా అంతేనని చెప్పారు. విశాఖను అగ్నిపర్వతం అంచున ఉన్నట్టు ఎందుకు చిత్రీకరిస్తున్నారని ప్రశ్నించారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రకటనకు ముందే ఇన్సైడర్ ట్రేడింగులో చంద్రబాబు బినామీలు చుట్టుపక్కల భూములను చుట్టేశారని విజయసాయి ఆరోపించారు. దానిపైన కూడా విచారణ జరిగితే నీతిచంద్రికల బండారం బయట పడుతుందని అన్నారు. విశాఖలో నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులు, కోస్టల్ రెగ్యులేషన్ల అతిక్రమణలు, ఇలా మీరు చేయని అక్రమాలు లేవని దుయ్యబట్టారు.
చైనాలోని వూహాన్ నగరంలో శిక్షణ పొందుతున్న 58 మంది తెలుగు ఇంజనీర్లు ఢిల్లీకి చేరుకున్నారని… వైద్య పరీక్షల అనంతరం వారిని ఇంటికి పంపిస్తారని విజయసాయి అన్నారు. మొన్న అఖిలపక్ష సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తిన వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు.
కాంగ్రెస్ పై విసుగుతోనే బీజేపీకి ఓటు: కేసీఆర్