ఏపీ మంత్రి కన్నబాబు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో రైతుబజార్లను మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాపిస్తున్న సమయంలో ప్రతిపక్షం ప్రభుత్వంపై బురదజల్లుతోందని మండిపడ్డారు.
రాష్ట్రంలో పంటలు కొనడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.ఇతర దేశాలకు ఎగుమతులు లేకపోవడం వల్లే ధర తగ్గిందని మంత్రి వెల్లడించారు. రాయలసీమలో పండిన అరటి పంటను రాష్ట్రంలోని రైతుబజార్లకు తరలిస్తున్నామని తెలిపారు. సంచార రైతుబజార్ల ద్వారా పంట ఉత్పత్తులను ఎగుమతులు చేస్తున్నామని కన్నబాబు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్తుల రక్షణ బాధ్యత గవర్నర్ దే: రేవంత్ రెడ్డి