telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మనమందరం సంయమనంతో ఉండాలి: మంత్రి హరీష్

Harish Rao TRS

ప్రస్తుత పరిస్థితుల్లో  మనమందరం సంయమనంతో ఉండాలని తెలంగాణ మంత్రి మంత్రి హరీష్‌రావు అన్నారు. గజ్వెల్ ఐఓసీ కార్యాలయంలో పీజేఎస్ పౌలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మంది క్రిష్టయన్ పాస్టర్లకు 25కేజీల బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ, దేశ చరిత్రలో మనకు తెలిసినప్పటి నుంచి ఇలా గుడులు, మసీదులు, చర్చిలు మూతపడటం ఎప్పుడూ చూడలేదన్నారు.

ప్రజల్లో ఆశ వర్కర్లకు, ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులకు అపారమైన గౌరవం ఉందన్నారు. కరోనా పూర్తిగా తగ్గేంత వరకూ మనమంతా ఓపికతో ఉండి.. ప్రభుత్వ సూచనలను పాటిద్దామని హరీష్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పాల్గొన్నారు.

Related posts