telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

మన ఇంట్లో మనం ఉందాం.. కరోనాను ఖతం చేద్దాం: హరీశ్‌రావు

harish rao trs

జనతా కర్ఫ్యూలో భాగంగా నేను మా కుంటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉన్నానని తెలంగాణ మంత్రి హరీష్‌రావు తెలిపారు. కర్ఫ్యూకి అందరూ సహకరించాలని, ఏం కాదనే ధోరణి వద్దని ఆయన అన్నారు. ఇలాంటి ధోరణి వలన ఇటలీ, చైనా లాంటి దేశాలు ఎలా వణికిపోతున్నాయో చూస్తున్నాం.

మనకు ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం మన ఇంట్లోనే ఉందామని తెలిపారు. పోలీసులు, మిలటరీ వాళ్లు పెట్టిన దానికన్నా మీరు స్వచ్చందంగా ఈ కర్ఫ్యూని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మనం మన ఇంట్లోనే ఉందాం. కరోనాను ఖతం చేద్దామని పిలుపునిచ్చారు.

Related posts