telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పాజిటివ్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా ప్రభావంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గురించి, తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్నీ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts