భారత వాయుసేనకు చెందిన మరో మిగ్-21 యుద్ధ విమానం రాజస్తాన్లో కుప్పకూలింది. ఘటన జరిగిన సమయంలో పైలట్ విమానం నుంచి ఎజెక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పైలట్ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. బికనీర్కు సమీపంలో ఉన్న శోభా సర్కీ ధానీ ఏరియాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని బికనీర్ ఎస్పీ తెలిపారు.
పుల్వామా ఉగ్రదాడి, మెరుపు దాడుల నేపథ్యంలో భారత్- పాక్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో యుద్ధ విమానం కూలిపోవడంతో అలజడి రేగింది. అయితే రాజస్తాన్లోని నాల్ ఎయిర్బేస్కు మిగ్-21ను ఐఏఎఫ్ తరలిస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. ఘటన జరిగిన వెంటనే వాయుసేనకు చెందిన ఓ బృందం హుటాహుటిన అక్కడకు చేరుకుంది. విమానం కూలిపోవడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.