అమెరికాలో క్రిస్మస్ పండుగ రోజు జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ విద్యార్థుల మృతదేహాలు శంషాబాద్ చేరుకున్నాయి. మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన సాత్వికా శరణ్, అరుణ్ సుహాస్ నాయక్, సుచరితా నాయక్ అగ్నిప్రమాదంలో చిక్కుకుని మరణించారు. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలకు సజీవదహనమయ్యారు.
అమెరికాలోని కొలిర్విలిలో ఈ దుర్ఘటన జరిగింది. అగ్నిప్రమాదంలో చిక్కుకుని మొత్తం నలుగురు మృతి చెందారు. ఇందులో ముగ్గురు నల్గొండ జిల్లాకు చెందిన టీనేజ్ విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన తోబుట్టువులు. మృతుల్ని సాత్వికనాయక్, సుహాస్నాయక్, జయ్సుచిత గుర్తించారు. వీరంతా 14 ఏళ్ల నుంచి 17 ఏళ్లలోపు వయస్సున్న వారే. మృతులు ముగ్గురు నల్గొండ జిల్లా ఆడిశర్లపల్లి మండలం గుర్రపు తండాకు చెందినవారు.