కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న “తలైవీ” చిత్రం. విజయేంద్ర ప్రసాద్ కథ రాశారు. ‘తలైవి’ బయోపిక్ను విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీలో సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో అరవిందస్వామి దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, లెజెండరీ యాక్టర్ ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో నటిస్తున్నారు. అలాగే మరో లెజెండ్రీ పొలిటీషియన్, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. బ్లేడ్ రన్నర్, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ కంగనా రనౌత్ను జయలలితగా చూపిస్తున్నారు. దర్శకుడు విజయ్ శోభన్ బాబు పాత్రకు ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్గుప్తాను ఎంపిక చేసారు. అయితే… ఇవాళ ఎంజీఆర్ జయంతిని పురస్కరించుకుని తలైవి మేకర్స్ ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఎంజీఆర్-జయలలిత మధ్య రొమాంటిక్ సన్నివేశాన్ని లేటెస్ట్ లుక్లో చూపించారు. చూడ ముచ్చటగా ఉన్న ఈ పోస్టర్ బయటకు రావడంతో.. ఎంజీఆర్ వీరాభిమానులు తమిళనాట సంబురాలు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
previous post