telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మెగాస్టార్  చిరంజీవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. కరోనా కారణంగా షూటింగ్ లు నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన చిరు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు.. కరోనా మహమ్మారి పట్ల ప్రజలకు అవగాహనా కల్పిస్తూ అప్పుడప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇంతకముందు ఒకసారి చిరంజీవి తన తల్లికి స్వయంగా చేపల కూర చేసి పెట్టారు. ఆ విషయాన్నీ సోషల్ మీడియాద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి వంట వీడియోతో అభిమానుల ముందుకు వచ్చారు మెగాస్టార్. ఈ వీడియోలో కేఎఫ్‌సీ చికెన్ వండటం ఎలా అనేది తన మనవరాళ్లకు నేర్పిస్తున్నారు. అందులో సుష్మిత కూతురు, శ్రీజ పెద్ద కూతురు ఉన్నారు. అందులో సుష్మిత కూతురు బయటి నుంచి కెఎఫ్‌సీ చికెన్ తెచ్చుకుందాం అంటే.. కోవిడ్ టైమ్‌లో బయటి నుంచి వద్దు. ఇంట్లోనే చేసుకుందాం అంటూ వంట మొదలు పెట్టారు చిరంజీవి. దీనికి సంబంధించిన వీడియోను చిరు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. దాంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే… కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Related posts