telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఒడిశా : బొగ్గు గనిలో ప్రమాదం.. నలుగురు మృతి.. ఇంకా..

accident in coal mine odisa costs 4 lives

రాష్ట్రంలోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన బొగ్గుగనిలో జరిగిన ప్రమాద ఘటనలో నలుగురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంస్థ అధికార ప్రతినిధి ఓ ప్రకటన చేసినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. కార్మికులు పనిలో నిమగ్నమై ఉండగా.. బొగ్గు ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంతో గనిలో సాధారణ కార్యకలాపాల పునరుద్ధరణకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో రోజుకు దాదాపు 20వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుందని తెలిపారు.

Related posts