telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : రాజస్థాన్ పై కేకేఆర్ విజయం…

ఈ రోజు ఐపీఎల్ 2020 లో రెండో మ్యాచ్ కోల్‌కత నైట్‌ రైడర్స్‌-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం ఉంచింది కోల్‌కత. కేకేఆర్ జట్టులో రాహుల్ త్రిపాఠి(39), శుభమ‌న్ గిల్(36) ఇయాన్ మోర్గాన్ (68 )పరుగులు చేయడంతో నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన రాయల్స్ మొదటి 5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు తరపున జొస్ బట్లర్ (35) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. మిగితా వారంతా విఫలం కావడంతో రాజస్థాన్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. దాన్తప్ కోల్‌కత 60 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన రాజస్థాన్ చెన్నై, పంజాబ్ తో కలిసి ఇంటి దారి పడితే విజయం సాధించిన కోల్‌కత మాత్రం ప్లే ఆఫ్ పై ఆశలను సజీవంగా ఉంచుకోవడం మాత్రమే కాకుండా పాయింట్ల పట్టికలో 4 వ స్థానానికి వచ్చింది. అయితే ఇప్పుడు కేకేఆర్ భవిష్యత్తు హైదరాబాద్ పై ఆధారపడి ఉంది. చూడాలి మరి ఎం జరుగుతుంది అనేది.

Related posts