telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కొత్త మూవీ అనౌన్సమెంట్

Production-8

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో 8వ చిత్రంగా రానున్న మూవీ అనౌన్సమెంట్ పోస్టర్ రిలీజ్ చేసారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రం దర్శకుడు స్వరూప్ దర్శకత్వంలో ఒక ఇంటరెస్టింగ్ ఫిలిం నిర్మిస్తున్నామనీ, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్ పేర్కొంది. పోస్టర్ లో ఓ గోడ పై కోడిపుంజు నిలుచొని ఉండగా.. గోడపై వాంటెడ్ పోస్టర్ అతికించబడి ఉంది. అతన్ని పట్టుకున్న వారికి 50 లక్షల రివార్డ్ అని రాసి ఉంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో విమర్శకుల ప్రసంశలు పొందిన స్వరూప్ ఆర్ఎస్జె మరోసారి డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడని అర్థం అవుతోంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’, నాగార్జునతో ‘వైల్డ్ డాగ్’ వంటి భారీ చిత్రాలను నిర్మిస్తోంది.

Related posts