telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఉగ్రదాడికి పాక్‌ లోనే వ్యూహ రచన.. ఆసుపత్రి నుంచి మసూద్ ఆదేశాలు!

Pakistan Pulvama attack says NIA

పుల్వామా వద్ద సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి వ్యూహ రచన పాకిస్తాన్‌ వేదికగానే జరిగినట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కనిపెట్టాయి. పుల్వామా ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. రావల్పిండిలోని ఓ ఆసుపత్రిలో తనకున్న ప్రాణాంతక రోగానికి చికిత్స పొందుతూనే, జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ సూచనలు ఇచ్చినట్లు గుర్తించారు.

దాడికి వారం రోజులకు ముందుగానే మసూద్ నుంచి ఓ ఆడియో సందేహం ఉగ్రవాదులకు అందింది. ఓ ఉగ్రవాదిని ఆత్మాహుతి దాడికి సిద్ధం చేసిన తరువాత బ్దుల్ రషీద్ ఘాజీ భారీ బాంబును తయారు చేసి ఓ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ లో అమర్చాడు. గతేడాది భద్రతా దళాల చేతిలో హతమైన తన మేనల్లుడు ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, ఈ యుద్ధంలో మరణం కన్నా సంతోషకరమైనది మరొకటి లేదంటూ ఆడియో టేపుల ద్వారా కశ్మీర్ యువతను రెచ్చగొట్టినట్లు బహిర్గతమైంది.

Related posts