telugu navyamedia
రాజకీయ వార్తలు

దేశంలో తగినన్ని కరోనా పరీక్షలు చేయట్లేదు: మన్మోహన్

Congress manmohan

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులపై మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కరోనా పరీక్షల పై ఆయన స్పందిస్తూ పలు సూచనలు చేశారు. కోవిడ్-19 పై పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన సూచనలను ఆ పార్టీ వీడియో రూపంలో తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

పెద్ద ఎత్తున పరీక్షలు చేయడం, కరోనా బాధితులను గుర్తించి ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందించడం చాలా ముఖ్యమని కాంగ్రెస్ నేతలు తెలిపారు. దేశంలో తగినన్ని పరీక్షలు చేయట్లేదు. పెద్ద ఎత్తున పరీక్షలు చేసే సదుపాయాలను పెంచలేకపోతే కరోనాపై విజయం సాధించడం సాధ్యం కాదని మన్మోహన్ సింగ్ తెలిపారు.

వలస కూలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, కూలీల సమస్యను తీర్చడానికి ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విధంగా వ్యవహరించే అవకాశం ఉందని అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. కూలీలను తమ రాష్ట్రాలకు తరలించే విషయం రెండు రాష్ట్రాల మధ్య జరిగే చర్చలపైనే ఆధారపడి ఉంటుందని రాహుల్ పేర్కొన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించడం, బాధితులను గుర్తించడం వంటి అంశాలు కరోనాపై పోరాటంలో చాలా ముఖ్యమైనవని తెలిపారు.

Related posts