telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

15 ఏళ్ళు పూర్తి చేసుకున్న”అతడు”

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన చిత్రం “అతడు”. ఈ సినిమా నేటితో 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సినిమా 2005 ఆగస్టు 10న విడుదలై అని వర్గాల ప్రేక్షకులను మెప్పించి భారీ విజయాన్ని అందుకుంది. దాదాపుగా ఈ చిత్రం 40 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమా విడుదలైన ఏడూ సంవత్సరాల తర్వాత మాటీవీ “అతడు” సినిమా శాటిలైట్ రైట్స్ కోసం ఏకంగా 3.5 కోట్లు చెల్లించింది. ఇది అప్పట్లో సెన్సేషన్. ఈ సినిమాకి ఉత్తమ నటుడుగా మహేష్ బాబు, ఉత్తమ మాటల రచయితగా త్రివిక్రమ్ నంది అవార్డులను అందుకున్నారు. అప్పటివరకూ రచయితగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాతోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇద్దామని అనుకున్నాడు. అందులో భాగంగానే ఈ కథను ముందుగా పవన్ కళ్యాణ్ కి వెళ్లి చెప్పగా అయన కథ వింటూ నిద్రపోయారట. ఆ తర్వాత ఇదే కథని మహేష్ బాబుకి చెబితే ఆయనకి బాగా నచ్చిందట. కానీ అప్పటికే అర్జున్, నాని సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ నెక్స్ట్ ఇయర్ చేద్దామని చెప్పాడట.. అప్పటిలోపు ఓ సినిమా చేయండి అని సలహా కూడా ఇచ్చాడట.. దీనితో త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మహేష్ తో సినిమాని స్టార్ట్ చేశాడు త్రివిక్రమ్. మహేష్ బాబు పెళ్లి తర్వాత విడుదలైన ఫస్ట్ సినిమా “అతడు”. ఇందులో నాజర్ పాత్రకి ముందుగా శోభన్ బాబు అనుకున్నారు కానీ ఆయన ఒప్పుకోలేదట. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల కోసం టైమ్-ఫ్రీజ్ ఎఫెక్ట్ షాట్లను వాడారు పీటర్ హెయిన్.

Related posts