telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ యాడ్ లో మహేష్ ఫ్యామిలీ మొత్తం…!

Mahesh-Babu

ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ “స‌రిలేరు నీకెవ్వ‌రు” అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. “స‌రిలేరు నీకెవ్వ‌రు” చిత్రంలో మ‌హేష్ మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బండ్ల గ‌ణేష్‌, విజ‌య‌శాంతితో పాటు ప‌లువురు సినీ న‌టులు చిత్రంలో న‌టిస్తున్నారు. ర‌ష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చి కుటుంబంతో కలిసి ట్రిప్ కు వెళ్ళాడు మహేష్. ఆ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు కెరీర్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో, తన కుటుంబానికి కూడా అంతే ప్రాముఖ్యం ఇస్తాడు. సినిమా షూటింగ్‌ల నుంచి విరామం దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రలకు వెళుతుంటాడు. తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. దీంతో మహేష్ కుటుంబానికి కూడా పాపులారిటీ పెరిగింది. దీంతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మహేష్ కుటుంబం మొత్తంతో ఓ యాడ్‌ను రూపొందించింది. ఈ యాడ్‌లో మహేష్‌తోపాటు నమత్ర, గౌతమ్, సితార కూడా నటించారు. ఈ విషయాన్ని మహేష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఆ యాడ్ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. “మా కుటుంబమంతా కలిసి నటించడం ఇదే తొలిసారి. చాలా సంతోషంగా గడిచింది. ధన్యవాదాలు” అంటూ మహేష్ కామెంట్ చేశాడు.

Related posts