telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

జనసేనలో టికెట్ కోసం.. దరఖాస్తు చేసుకున్న.. పసుపులేటి బాలరాజు..

pasupuleti applied for ticket in janasena

ఇటీవల జనసేన పార్టీ ఆసక్తి ఉన్న వారి నుండి టికెట్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రకటనకు భారీగానే స్పందన వచ్చిందని చెప్పాలి. అనేక మంది ఆశావహులు తమ దరఖాస్తులను పరిశీలించాలని స్క్రీనింగ్ కమిటీ కి సమర్పించారు. తాజాగా, ఈ జాబితాలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పేరు కూడా చేరింది. విజయవాడలోని ‘జనసేన’ కార్యాలయంలోని స్క్రీనింగ్ కమిటీకి పసుపులేటి బాలరాజు తన బయోడేటాను సమర్పించారు. పాడేరు అసెంబ్లీ స్థానం నుంచి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కోరారు.

నిన్న ఒక్కరోజే, 150 బయోడేటాలు స్క్రీనింగ్ కమిటీకి వచ్చాయని పార్టీ తెలిపింది. ‘జనసేన’ ఆశావహులలో మైనార్టీ వర్గాలకు చెందిన ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు. గుంటూరు, కర్నూలు, కడప, నెల్లూరు, మదనపల్లె తదితర స్థానాల నుంచి అభ్యర్థిత్వం కోరుతూ వచ్చిన బయో డేటాల్లో పలువురు ముస్లింలు ఉన్నట్టు ‘జనసేన’ ఓ ప్రకటనలో తెలిపింది. గుంటూరు నుంచి వైద్యులైన ముస్లిం దంపతులు తమ బయోడేటాలు సమర్పించినట్టు పేర్కొంది.

Related posts