telugu navyamedia
సినిమా వార్తలు

భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌… ఫ్యామిలీతో మహేష్

Mahesh-Babu

వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ ఆడే మ్యాచ్‌ల‌ని వీక్షించేందుకు సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు సైతం ఆసక్తిగా ఉన్నారు. ఈ మేరకు కొంతమంది ఇంగ్లండ్‌కి ప‌య‌న‌మ‌వుతున్నారు. “మ‌హ‌ర్షి” విజ‌యం త‌ర్వాత ప‌లు దేశాలు సంచ‌రిస్తున్న మ‌హేష్ రేపు ఓవ‌ల్ స్టేడియంలో ఆస్ట్రేలియా, భార‌త్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌కి త‌న ఫ్యామిలీతో హాజ‌రు కానున్నాడ‌ట‌. ఒక‌వైపు హోరాహోరీగా జ‌రుగుతున్న మ్యాచ్ వీక్ష‌కుల‌కి క‌నువిందు చేయ‌నుండ‌గా, మ‌రో వైపు మ‌హేష్ స్టేడియంలో కన్పించడం ఆయన అభిమానులకు డబుల్ ధమాకా అనే చెప్పొచ్చు. ఇండియా వర్సస్ ఆస్ట్రేలియా ఈ రెండు మేటి జట్ల మధ్య ఆదివారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:00 గం.లకు మ్యాచ్ జరగనుంది. మ‌హేష్ ఈ ట్రిప్ త‌ర్వాత అనీల్ రావిపూడి ద‌ర్శ‌కత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

Related posts