telugu navyamedia
సినిమా వార్తలు

“లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదలకు ఈసీ “పచ్చజెండా”

Lakshmi's-NTR

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత నేత, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 29న విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసేంత వరకు ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ శ్రీకాళహస్తికి చెందిన మోహన్ రావు అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ చిత్రానికి ఈసీ ట్విస్ట్ ఇచ్చింది. “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రాన్ని తమకు చూపించాలంటూ నిర్మాత రాకేష్ రెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 11 గంటలకు ఎన్నికల సంఘం ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యాడు నిర్మాత రాకేశ్ రెడ్డి. లక్ష్మీస్ ఎన్టీఆర్ పై వస్తున్న అభ్యంతరాలపై చిత్ర నిర్మాత ఎంసీఎంసీ కమిటీ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు. సినిమాను లక్ష్మీ పార్వతి రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించామని, సినిమాలో పసుపు జెండాలు తప్ప పార్టీ గుర్తులెక్కడా చూపలేదని వివరణ ఇచ్చారు. ఆయన వివరణతో సంతృప్తి చెందిన ఈసీ సినిమా విడుదల చేసుకోవచ్చని తెలుపుతూ గ్రీన్ సిగ్నల్ (పచ్చ జెండా) ఇచ్చింది. దీంతో అడ్డంకులన్నీ తొలగాయని, చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించారు. దీంతో ఇప్పటివరకూ ఈ సినిమా అసలు విడుదలవుతుందా ? లేదా ? అన్న ఆందోళనలో ఉన్న ఆర్జీవీ అభిమానులకు సినిమా విడుదలవుతుందనే స్పష్టత వచ్చేసింది.

Related posts