ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్కు సమంత పరిచయమైన విషయం తెలిసిందే… అయితే…ఈ స్టార్ హీరోయిన్ “జాను” తర్వాత మరో సినిమాను ప్రకటించలేదు. లాక్డౌన్లో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉన్నారు సమంత. ఇటీవల సామ్జామ్ అంటూ ఆహాలో అలరిస్తున్నది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలో సమంతకు మరో బంపర్ ఆఫర్ తగిలింది. గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఎపిక్ లవ్ స్టోరీ “శాకుంతలం”. అయితే… ఈ మూవీలో సమంత టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు న్యూ ఇయర్ సందర్భంగా సినిమా బృందం ప్రకటించింది. నూతన సంత్సరం సందర్భంగా “శాకుంతలం” టైటిల్ మోషన్ పోస్టర్ను విడుదల చేసింది. ఇందులో సమంత పేరు అధికారికంగా ప్రకటించారు. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా “శాకుంతలం” తెరకెక్కుతోంది. మిగిలిన నటీనటుల వివరాలను అతి త్వరలోనే ప్రకటించనున్నట్టు ఈ సినిమా యూనిట్ ప్రకటించింది.
previous post