telugu navyamedia
సినిమా వార్తలు

స్టేజ్ పై ‘మ మ మహేషా’ సాంగ్ కి స్టెప్పులేసిన మ‌హేష్‌..

సూపర్​స్టార్​ మహేశ్‌బాబు నటించిన సినిమా ‘సర్కారు వారి పాట. ఇటీవల రిలీజై బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం కర్నూలులో విజయోత్సవ వేడుకను నిర్వహించిన చిత్ర బృందం కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది.

‘సమ్మర్‌ సెన్సేషనల్‌ బ్లాక్‌ బ్లస్టర్‌’ పేరుతో రిలీజ్‌ చేసిన ఈ వీడియోలోని మహేశ్‌బాబు హావభావాలు, సంభాషణలు అభిమానులను ఉర్రూతలూగించేలా ఉన్నాయి. వెన్నెల కిశోర్‌, కీర్తి సురేశ్‌, సుబ్బరాజు, సముద్రఖనితో మహేశ్‌ చేసిన హంగామా ఇందులో క‌నిపిస్తున్నాయి.

ఇక పోతే..కర్నూలులో జ‌రిగే ఈ విజయోత్సపు కార్యక్రమానికి మహేశ్​ బాబుతో సహా టీమ్ మొత్తం హాజరైంది. ఒక్కొక్కరూ చాలా జోష్​తో స్పీచ్​లు ఇచ్చారు. ఇక స్టేజ్​పై డాన్సర్స్ ‘మ మ మహేషా’ సాంగ్​కి డాన్స్ చేస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వారితో కలిసి స్టెప్పులేసే ప్రయత్నం చేశారు. ఆ వెంట‌నే మహేశ్​ కూడా స్టేజ్ పైకి వెళ్ళి ఎన‌ర్జిటిక్‌గా స్టెప్పులు వేశారు. దీంతో ఆ ప్రాంగ‌ణ‌మంతా ద‌ద్ద‌రిల్లిపోయింది.

త‌మ అభిమాన హీరో మాస్ స్టెప్పులు వేయ‌డంతో ఫ్యాన్స్ పండ‌గ చేసుకున్నారు. మహేష్ స్టేజ్ ఎక్కి ఇలా డాన్స్ చేయడం తొలిసారి. ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఎప్పుడూ ఇలా చేయలేదు. దీంతో ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

కర్నూలులో ఈవెంట్ జరగడం గురించి మహేష్ మాట్లాడుతూఒక్కడు సినిమా చిత్రీకరణ సమయంలో కర్నూలు వచ్చా. మళ్లీ ఇప్పుడిలా రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్ర విజయోత్సవ వేడుకను ఇక్కడ నిర్వహిస్తున్నామని నిర్మాతలు చెప్పగానే హ్యాపీగా ఫీలయ్యా. ఈ వేడుకకు ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు. ఫంక్షన్‌ అంటూ జరిగితే రాయలసీమలోనే జరగాలి అన్నంతగా ఉంది ఇక్కడి వాతావరణం. మీ అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నారు.

ఈ సినిమా చూడగానే మా అబ్బాయి నాకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి, హగ్‌ చేసుకున్నాడు. ‘అన్నింటికంటే నువ్వు ఈ సినిమాలోనే బాగా చేశావు నాన్న’ అని మా అమ్మాయి మెచ్చుకుంది. ‘పోకిరి, దూకుడు కంటే ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది’ అని నాన్న అన్నారు. ఈ క్రెడిట్‌ అంతా దర్శకుడు పరశురామ్‌కే చెందుతుంది. లాక్‌డౌన్‌ కారణంగా రెండేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మీరందించిన విజయం ముందు అవన్నీ ఇప్పుడు కనిపించట్లేదని మ‌హేష్ తెలిపారు.

 

Related posts