వరుస హిట్లు కొట్టి లక్కీ బ్యూటీగా పేరు సంపాదించుకుంది రష్మికా మందన్న. ఈ ముద్దుగుమ్మ ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను సినిమాలో రష్మికా హీరోయిన్గా ఎన్నకైందని వార్తలు వచ్చాయి. ఈ సినిమా 1970లో ఇండియన్ రా ఏజెన్సీ చేసిన కొన్ని క్లిష్టమైన మిషన్ల ఆధారంగా తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే లక్కీ బ్యూటీ ఇంతలోనే మరో బాలీవుడ్ అవకాశం అందుకుందని అంటున్నారు. అది కూడా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రగా చేయనున్న సినిమాలో ఈ అమ్మడు కనిపించనుందనేది తాజా సమాచారం. ఇందులో రష్మికా అమితాబ్ కూతురి పాత్రలో చేయనుందట. తండ్రీ, కూతురు మధ్య జరిగే విభిన్న కథాంశంతో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా వికాస్ బహెల్ తెరకెక్కించనున్నాడు. అయితే ఈ రెండు సినిమాలతో రష్మికా బాలీవుడ్లో సొంత క్రేజ్ను సంపాదించుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల తమిళంలో అరంగేట్రం చేయనుంది. కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాతో ఈ కన్నడ బ్యూటీ తమిళంలో కనిపించనుంది. చూడాలి మరి ఈ సినిమా హిట్ అవుతుందా… అనేది.
previous post
next post
ఎస్సీలను విడగొట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు: జగన్